కొనసాగుతున్న బీఆర్ఎస్ లోకి వలసల పర్వం

నమస్తే శేరిలింగంపల్లి: బీఆర్ఎస్ లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ లో చేరుతున్నారు.

పార్టీలో చేరిన వారితో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

ఈ నేపథ్యంలోనే శేరిలింగంపల్లి డివిజన్ ఓల్డ్ లింగంపల్లి విలేజ్ నుండి శేరిలింగంపల్లి విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ప్రెసిడెంట్ గడ్డం రవి యాదవ్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఓల్డ్ లింగంపల్లి యూత్ పార్టీలో చేరారు. వారిని శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానిస్తున్న రాగం నాగేందర్ యాదవ్

వారితో పాటుగా డివిజన్ అధ్యక్షులు రాజు యాదవ్, రవీందర్ గౌడ్, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్ ఉన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here