కార్యకర్తకు, నాయకులకు రుణపడి ఉంటాం : కార్పొరేటర్ హమీద్ పటేల్

నమస్తే శేరిలింగంపల్లి: బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం పండుగ వాతావరణాన్ని తెచ్చింది. కొండాపూర్ డివిజన్ లోని పలు బస్తీలలో, కాలనీలలో కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ పాల్గొని బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరణ చేశారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీ, కొత్తగూడ, అంజయ్య నగర్, బంజారా నగర్, ఓల్డ్ పీజేఆర్ నగర్, న్యూ పీజేఆర్ నగర్, మస్తాన్ నగర్, ప్రేమ్ నగర్ ఏ బ్లాకు, ప్రేమ్ నగర్ బి బ్లాకు, మార్తాండ్ నగర్ లలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ యువ జన నాయకులు ఆదిల్ పటేల్ తో కలిసి పార్టీ జెండా ను ఆవిష్కరించారు.

కొండాపూర్ డివిజన్ లో పార్టీ జెండాను ఆవిష్కరిస్తున్న కార్పొరేటర్ హమీద్ పటేల్

ఈ సందర్బంగా కార్పొరేటర్ హమీద్ పటేల్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ కార్యకర్తలకు, నాయకులకు, ప్రతి ఒక్కరికి బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్న ప్రతి కార్యకర్తకు, నాయకుడికి రుణపడి ఉంటామని అన్నారు. పేద ప్రజలకు అమలు చేసిన పలు సంక్షేమ పథకాలు సీఎం కేసీఆర్ పాలనాదక్షణకు నిదర్శనమని తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here