రాబోయే ఎన్నికల్లో బహుజనులదే గెలుపు

  • బిఎల్ఎఫ్ రాష్ట్ర చైర్మన్ నల్లా సూర్య ప్రకాష్

నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణలో రాబోయే ఎన్నికలలో 119 శాసనసభ అసెంబ్లీ ఎన్నికలలో బిఎల్ఎఫ్ ఆధ్వర్యంలో పోటీ చేస్తున్నామని, తెలంగాణలో బహుజనులదే గెలుపని బిఎల్ఎఫ్ రాష్ట్ర చైర్మన్ నల్ల సూర్యప్రకాష్ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మియాపూర్ ప్రాంతంలో ముజాఫర్ అహ్మద్ నగర్ లో జరిగిన బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బిఎల్ఎఫ్) శేరిలింగంపల్లి శాసనసభ నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ రాబోయే ఎన్నికలలో తెలంగాణలో బహుజనులదే గెలుపని అన్నారు. రాబోయే ఎన్నికల్లో 119 స్థానాల్లో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ పోటీ చేస్తుందని బీసీని ముఖ్యమంత్రిని చేస్తుందని తెలియజేశారు.

  • బిఎల్ఎఫ్ శేరి లింగంపల్లి నియోజకవర్గ కన్వీనర్ గా పల్లె మురళి

బిఎల్ఎఫ్ శేరిలింగంపల్లి నియోజకవర్గ కమిటీని బిఎల్ఎఫ్ చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ వి. తుకారాం నాయక్ ప్రకటించారు. కన్వీనర్ గా పల్లె మురళి, కో – కన్వీనర్ గా కర్ర దానయ్య కమిటీ సభ్యులుగా జి లావణ్య, డి. నరసింహ, ఈ దశరథ్ నాయక్, ఎండి ఇక్రాన్, డి మధుసూదన్, ఎండి నజీర్, బి.విమల, ఎల్. రాజులను ప్రకటించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని 10 డివిజన్ లో కమిటీలు వేస్తామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో మైదం శెట్టి రమేష్, అనిల్ కుమార్, కళావతి, అంగడి పుష్ప, జి శివాని, ధారా లక్ష్మి, డి లక్ష్మి, బి అనిత, వై రాంబాబు, బి.లలిత, చందర్, రవీందర్ గౌడ్, ఇసాక్, తుడుం పుష్పలత, పార్వతి, మియాపూర్ హైదర్ నగర్, చందానగర్ శేరిలింగంపల్లి డివిజన్లకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here