బీజేపీకి ఓటేసి అభివృద్ధికి పట్టం కట్టండి : బీజేపీ అభ్యర్థి రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి : భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రవికుమార్ యాదవ్ కు మద్దతుగా గచ్చిబౌలి డివిజన్ లో దర్గా నుండి టెలికాం నగర్ వరకు గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.

ర్యాలీలో పాాల్గొని మాట్లాడుతున్న చేవెళ్ళ మాజీ పార్లమెంటు సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి

ఈ కార్యక్రమంలో చేవెళ్ళ మాజీ పార్లమెంటు సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డితో కలిసి ఆ పార్టీ అభ్యర్థి రవికుమార్ యాదవ్ పాల్గొని కమలానికి ఓటేసి బీజేపీ పార్టీకి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. ఈ నెల 30 వ తారీకున జరిగే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఓటేసి అభివృద్ధికి పట్టం కట్టాలని, అవినీతి పాలనకు చరమగీతం పాడాలని చెప్పారు. అందరీ ఆశీర్వాదంతో గెలిచి ప్రజాసమస్యల పరిష్కారానికి కృసి చేస్తానని హామీ ఇచ్చారు.

పూలతో అపూర్వ స్వాగతం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here