కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీల దొంగ హామీలు ఎవరు నమ్మరు: రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్

  • 96వ రోజు కొనసాగిన గడపగడపకు బిజెపి రవన్న ప్రజా యాత్ర

నమస్తే శేరిలింగంపల్లి: కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీల దొంగ హామీలు ఎవరు నమ్మరని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ అన్నారు. గడపగడపకు బీజేపీ కార్యక్రమంలో భాగంగా చందానగర్ డివిజన్ శివాజీ నగర్ వీకర్ సెక్షన్ టెలిఫోన్ కాలనీలలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ పాదయాత్ర చేపట్టారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమలు కానీ హామీలను ఇస్తూ ప్రజలను మభ్య పెట్టడానికి ఆ రెండు పార్టీలు ఒకటై ప్రజల ముందుకు వస్తున్నారని వారికి తగిన బుద్ధి శేర్లింగంపల్లి నియోజకవర్గం ప్రజలు ఓటు ద్వారా తిరిగి కొడతారని ఎద్దేవా చేశారు. ఏది ఏమైనా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కాషాయం జెండా ఎగరవేయడం పక్క అన్నారు.

ప్రజల మన్నలను పొంది అభివృద్ధి చేసి మంచి పేరు ప్రతిష్టలు పొందుతారని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ నవతారెడ్డి, రామ్ రెడ్డి, రామస్వామి, శ్రీనివాస్ రెడ్డి, మల్లేష్ గౌడ్, ప్రభాకర్ , కృష్ణ దాస్, చందర్ యాదవ్, గౌస్ బాయ్, రాజు, అశోక్, రవి పాల్గొన్నారు

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here