రాజగోపాల్ రెడ్డి భారీ మెజార్టీతో గెలవడం ఖాయం

  • మదినగూడ టెంపుల్ కమిటీ చైర్మన్, బిజెపి సీనియర్ నాయకుడు బోయినపల్లి వినోద్ రావు

నమస్తే శేరిలింగంపల్లి: మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం లో భాగంగా శుక్రవారం మునుగోడు మండలం, చోల్లెడు గ్రామంలో బిజెపి అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందామని… మదినగూడ టెంపుల్ కమిటీ చైర్మన్, బిజెపి సీనియర్ నాయకుడు బోయినపల్లి వినోద్ రావు ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. బిజెపితోనే అభివృద్ధి సాధ్యమని, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలను ప్రతి ఒక్కరికి వివరించారు. మునుగోడులో బిజెపి అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి విజయం ఖాయమని.. ఆ దిశగా నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు.

బిజెపి అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి గెలుపే లక్ష్యంగా మునుగోడు మండలం, చోల్లెడు గ్రామంలో ప్రచారం నిర్వహిస్తున్న మదినగూడ టెంపుల్ కమిటీ చైర్మన్, బిజెపి సీనియర్ నాయకుడు బోయినపల్లి వినోద్ రావు

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here