ప్రజా సంక్షేమ, సుభిక్ష పాలన బీజేపీతోనే సాధ్యం: బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి : అన్ని వర్గాల ప్రజలను దొంగ హామీలతో మభ్యపెడుతూ ప్రభుత్వం మోసం చేస్తున్నదని బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్ అన్నారు. మాదాపూర్ డివిజన్, సాయి నగర్ నుంచి పెద్ద ఎత్తున యువకులు గోపాల్ ముదిరాజ్, మహేందర్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలో చేరగా.. వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ ఎమ్మెల్యే గాంధీ ఇన్నాళ్లుగా ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదని, నియోజకవర్గాన్ని అవినీతికి, అక్రమాలకు, భూ కబ్జాలకు అడ్డాగా మార్చారన్నారు.

బీఆర్ఎస్ నాయకులను ఉద్దేశించి మాట్లాడుతున్న రవికుమార్ యాదవ్
ర్యాలీగా వెళ్తున్న బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్

బి.ఆర్.ఎస్ నాయకులు ప్రతి పనికి డబ్బులు వసూలు చేస్తూ నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టిస్తున్నారన్నారు. నియోజకవర్గంలో ప్రతి కాలనీ లో, ప్రతి బస్తీలో మంజీరా పైప్ లైన్లు, రోడ్లు, డ్రైనేజీ లైన్లు, ఇళ్ళ పట్టాలు ఇచ్చింది, అభివృద్ధి పనులు చేసింది, ప్రజలకు సేవ చేసింది పి.జే.ఆర్, భిక్షపతి యాదవ్ మాత్రమేనని తెలిపారు. వారి అడుగుజాడల్లో నడుస్తూ ప్రజల వెంట, ప్రజలకోసం పని చేస్తానని హామీ ఇచ్చారు. ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని పార్టీలో చేరిన వారికి, ప్రజలకు భరోసా కల్పించారు. పార్టీలో చేరిన వారిలో శంకర్ , సత్యరాజ్, అంజి, భిక్షపతి యాదవ్, రమణయ్య యాదవ్, శ్రీను, విజయ్ వారి మిత్రులు, స్థానిక కాలనీ వాసులు ఉన్నారు. కార్యక్రమంలో రాధాకృష్ణ యాదవ్, ఎల్లేష్, వెంకటేష్ యాదవ్, మదనా చారి, చండప్ప శ్రీను, మధు యాదవ్, గోవర్ధన్ రెడ్డి, నరేష్, రమేష్, వెంకట కృష్ణ, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పార్టీలో చేరిన యువకులతో బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here