- పక్కింట్లో నిద్రిస్తున్న చిన్నారి సమద్ స్పాట్ డెడ్…
- చికిత్స పొందుతూ శ్వాస విడిచిన వాహనదారుడు ఎండీ రషీద్…
నమస్తే శేరిలింగంపల్లి : వర్షం, ఈదురు గాలుల కారణంగా మియాపూర్ పీఎస్ పరిధిలోని హఫీజ్ పేట్ సాయినగర్లో విషాధ ఘటన చోటుచేసుకుంది. ఓ ఇంటిపై నుంచి పడిన ఇటుకల వల్ల ఇద్దరు మృతి చెందారు.
![](https://namastheslp.com/wp-content/uploads/2024/05/WhatsApp-Image-2024-05-26-at-9.23.56-PM.jpeg)
వివరాలు.. మియాపూర్ ఓల్డ్ హాఫీజ్ పేట్ సాయి నగర్ లో కురిసిన వర్షం ఈదురు గాలుల వల్ల స్థానికంగా ఐదంస్తుల భవనంలోని ఎస్.కే.కుర్షిద్ ఇంటి బాల్కనీ కూలీ పక్కనున్న రేకుల ఇంటిపై.. అదే దారిలో వెళ్తున్న మరో వ్యక్తిపై పడ్డాయి. దీంతో ఆ ఇంట్లో నిద్రిస్తున్న మూడేండ్ల చిన్నారి సమద్ (3) అక్కడిక్కడే మృతి చెందగా.. ఆ దారిలో బైక్ పై వెళ్తున్న ఎండీ రషీద్ (45) తీవ్ర గాయాల పాలయ్యాడు. దీంతో అతడిని స్థానిక శ్రీకర ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మియాపూర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపడుతున్నారు.
![](https://namastheslp.com/wp-content/uploads/2024/05/WhatsApp-Image-2024-05-26-at-9.23.55-PM.jpeg)