చందానగర్ డివిజన్ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తా : కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని వేమన వికర్ సెక్షన్ కాలనీలో చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి కాలని వాసులతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. కాలనిలోని అంగన్ వాడి కేంద్రాన్ని సందర్శించి చిన్నారులతో ముచ్చటించారు. కాలనీలో చేపట్టిన డ్రైనేజీ పనులను పరిశీలించారు. కాలనిలో జరగాల్సిన అభివృద్ధి పనులపై కాలనీవాసులతో చర్చించారు. ఈ సందర్బంగా కాలనీవాసులు రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సమస్యలను ఆమె దృష్టికి తేవడంతో .. త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి , టీఆర్‌ఎస్ నాయకులు నరేందర్ భల్లా , కొండల్ రెడ్డి-, అమిత్ దూబే, అవినాష్, సందీప్ రెడ్డి , కాలనీవాసులు రమేష్, మల్లేష్, అనిల్, కృష్ణవేణి, జ్యోతి రెడ్డి, ఉపేందర్, వెంకటేష్, రాము పాల్గొన్నారు.

వేమన వికర్ సెక్షన్ కాలనీలో కాలని వాసులతో కలిసి పాదయాత్ర చేస్తున్న కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here