నమస్తే శేరిలింగంపల్లి: శిల్పారామం మాదాపూర్ లో కొనసాగుతున్న ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళా ప్రజల ఆదరణ చూరగొంటున్నది. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శిరీషా దేవులపల్లి తన బృందంతో కలిసి భారత నాట్య ప్రదర్శన అలరించింది. బెంగుళూర్ కు చెందిన ప్రియదర్శిని, వాసుదేవ్ చేసిన భరతనాట్య ప్రదర్శన ఆకట్టుకున్నది.

