కళ్ళు చెదిరేలా వస్తువులు.. కనువిందుగా నృత్యాలు

ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళలో చీరెల కొనుగోలులో మహిళలు

నమస్తే శేరిలింగంపల్లి: శిల్పారామం మాదాపూర్ లో నిర్వహిస్తున్న ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళ మహిళలను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అద్దాలతో కూడిన గృహ అలంకరణ వస్తువులు , పెయింటింగ్ చీరలు, డ్రెస్ మెటీరియల్స్, ముత్యాల నగలు, ఆర్టిఫిషల్ జ్యువలరీ, కాశ్మీరీ చీరలు, తోలు చెప్పులు, మొదలైనవి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో సాహితి అజాపారు బృందం కూచిపూడి నాట్య గురువు కుమారి ప్రణవి తుమ్మాటి శిష్య బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి.

నృత్య ప్రదర్శనలో కళాకారులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here