నమస్తే శేరిలింగంపల్లి: శిల్పారామం మాదాపూర్ లో ఆల్ ఇండియా శారీ మేళ బతుకమ్మ ముగింపు ఉత్సవం సందర్బంగా నారాయణి నాట్యాలాయ గురువు సంతోష్ కుమార్ తమంగ్ శిష్య బృందంచే భరతనాట్య ప్రదర్శన ఎంతగానో అలరించింది.
పుష్పాంజలి, అలరిపు , గణేశా కౌతం, జతిస్వరం, శబ్దం, దశావతారం, కీర్తనం, కృతి, తిల్లాన, మంగళం అంశాలను అంకిత, పద్మ, భవ్య, హర్షిత, పియుషి, శరణ్య, రుచిత, వృందా , ఐశ్వర్య, సహస్ర,సిరిచందన, మిశ్క, పార్వతి, జనని, సోమా మొదలైన వారు ప్రదర్శించి మెప్పించారు.
సంజయ్ జోషి కథక్ నాట్య గురువులు, రాజేంద్ర నియతి భరతనాట్యం గురువర్యులు, డాక్టర్ విజయపాల్ కూచిపూడి నాట్య గురువులు, డాక్టర్ ఆదిత్య కిరణ్ సంగీత గురువర్యులు ముఖ్య అతిధులుగా విచ్చేసి కళాకారులను అభినందించారు.