అలరించిన భరతనాట్య ప్రదర్శన

నమస్తే శేరిలింగంపల్లి: శిల్పారామం మాదాపూర్ లో ఆల్ ఇండియా శారీ మేళ బతుకమ్మ ముగింపు ఉత్సవం సందర్బంగా నారాయణి నాట్యాలాయ గురువు సంతోష్ కుమార్ తమంగ్ శిష్య బృందంచే భరతనాట్య ప్రదర్శన ఎంతగానో అలరించింది.

పుష్పాంజలి, అలరిపు , గణేశా కౌతం, జతిస్వరం, శబ్దం, దశావతారం, కీర్తనం, కృతి, తిల్లాన, మంగళం అంశాలను అంకిత, పద్మ, భవ్య, హర్షిత, పియుషి, శరణ్య, రుచిత, వృందా , ఐశ్వర్య, సహస్ర,సిరిచందన, మిశ్క, పార్వతి, జనని, సోమా మొదలైన వారు ప్రదర్శించి మెప్పించారు.

సంజయ్ జోషి కథక్ నాట్య గురువులు, రాజేంద్ర నియతి భరతనాట్యం గురువర్యులు, డాక్టర్ విజయపాల్ కూచిపూడి నాట్య గురువులు, డాక్టర్ ఆదిత్య కిరణ్ సంగీత గురువర్యులు ముఖ్య అతిధులుగా విచ్చేసి కళాకారులను అభినందించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here