నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలో కొనసాగుతున్న, చేపట్టాల్సిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి అన్నారు. చందానగర్ శ్రీదేవి థియేటర్ రోడ్డు, సురక్ష ఎన్ క్లేవ్ శంకర్ నగర్, వేమన రెడ్డి కాలనీలలో కార్పొరేటర్ మంజులతో పాటు శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ శంకరయ్య పర్యటించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సిసిరోడ్డు పనులను పరిశీలించారు. చందానగర్ డివిజన్ పరిధిలోని ముంబయి జాతీయ రహదారి నుంచి అమిన్ పూర్ మార్గంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి రహదారి విస్తరణ, నాలపై కల్వర్టును వెడల్పు చేసి వాహన రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆమె జోనల్ కమిషనర్ శంకరయ్య ను కోరారు. అనంతరం ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి , Ghmc అధికారులు, టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
![](https://namastheslp.com/wp-content/uploads/2022/11/IMG-20221124-WA0061.jpg)