ప్రజల మనిషి జ్ఞానేంద్ర ప్రసాద్

  • జ్ఞానేంద్ర ప్రసాద్ సేవలను స్మరించుకున్న బీజేపీ నేతలు

నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం సుపరిచితులు, సంఘ సేవకుడు, ప్రజల సంక్షేమానికి అహర్నిశలు కష్టపడిన వ్యక్తి బిజెపి అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన వ్యక్తి.. ప్రజల మనిషి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, కీర్తిశేషులు జ్ఞానేంద్ర ప్రసాద్ అని బిజెపి నేతలు సేవలను కొనియాడారు. జ్ఞానేంద్ర ప్రసాద్ జయంతి సందర్భంగా హఫీజ్ పెట్, మియాపూర్ డివిజన్ సంయుక్తంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఆల్విన్ x రోడ్, మియాపూర్ మమత ఎస్టేట్స్ వద్ద జ్ఞానేంద్ర ప్రసాద్ కుటుంబ సభ్యులతో ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సంస్మరణ సభ, అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని వారికి ఘన నివాళులు అర్పించారు. తదనంతరం వారి సేవలను కొనియాడారు.

సంస్మరణలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు
ఆల్విన్ x రోడ్, మియాపూర్ మమత ఎస్టేట్స్ వద్ద నిర్వహించిన సంస్మరణలో జ్ఞానేంద్ర ప్రసాద్ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న ఆయన కుటుంబ సభ్యులు, బీజేపీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ నాయకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here