మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట

  • శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలో రూ.8 కోట్ల 46 లక్షలతో రోడ్లు, వరదనీటి పనులు
  • శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తున్నామని, అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అధికారులను ఆదేశించారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని లింగంపల్లి విలేజ్, వెంకట్ రెడ్డి కాలనీ, బృందావన్ కాలనీ, భాగ్యలక్ష్మి కాలనీ, శిల్ప గార్డెన్ ,సెంట్రల్ పార్క్ ఫేస్ 2 కాలనీలలో రూ.8 కోట్ల 46 లక్షల అంచనావ్యయంతో చేపట్టబోయే సీసీ రోడ్లు, వరద నీటి కాల్వ నిర్మాణం పనులకు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు.


లింగంపల్లి విలేజ్ నుండి తార నగర్ నుండి లింగంపల్లి కల్వర్ట్ వరకు రూ.5 కోట్ల 50 లక్షల అంచనా వ్యయంతో వరద నీటి కాల్వ నిర్మాణం, వెంకట్ రెడ్డి కాలనీలో రూ.50 లక్షల అంచనా వ్యయంతో సీసీ రోడ్లు, బృందావన్ కాలనీలో రూ.46 లక్షలతో సీసీ రోడ్లు, భాగ్యలక్ష్మీ కాలనీలో రూ.50 లక్షలతో సీసీ రోడ్లు, శిల్ప గార్డెన్ కాలనీలో రూ.50 లక్షలతో సీసీ రోడ్లు, సెంట్రల్ పార్క్ ఫేస్ 2 కాలనీలో రూ.1 కోటి రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డ్ మెంబర్లు, ఏరియా కమిటీ మెంబర్లు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, పాత్రికేయ మిత్రులు, కాలనీ వాసులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here