రూ. 2 వేల కోసం కొట్లాట… బ్లేడుతో గొంతు కోసుకున్న ఇద్దరు స్నేహితులు…

  • మద్యం మత్తులో ఒకరిపై ఒకరు పరస్పర దాడి
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న  యువకులు

నమస్తే శేరిలింగంపల్లి: నగదు విషయంలో తగాదా ఇద్దరి స్నేహితుల మధ్య రక్తపాతం సృష్టించింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకుని అపస్మారక స్థితికి చేరుకున్నారు. ఈ ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం.. హఫీజ్ పేట్ కు చెందిన షబ్బీర్, మధు స్నేహితులు. దీపావళి పండుగను పురస్కరించుకొని సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము 4 వరకు మద్యం సేవిస్తూ పేకాట ఆడారు. ఈ క్రమంలో మద్యం మత్తులో ఉన్న వీరిద్దరూ రూ. 2 వేల కోసం ఘర్షణ పడ్డారు. గొడవ పడుతూనే వీరిద్దరూ ఉదయం ఓల్డ్ హాఫిజ్ పేట్ డీమార్ట్ వద్దకు చేరుకున్నారు. మాటా.. మాటా పెరగడంతో ఒకరినొకరు కర్రలతో దాడి చేసుకున్నారు. ఆపై బ్లేడ్లతో దాడి చేసుకొని గొంతుకోసుకున్నారు. తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే రక్తం మడుగులో కుప్పకూలారు. వారిలో ఒకరిని ఆటోలో మరొకరిని అంబులెన్సులో అసుపత్రికి తరలించారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

రక్తం మడుగులో యువకులు
యువకుడిని అంబులెన్స్ లోకి ఎక్కిస్తున్న సిబ్బంది
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here