శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 24 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని మియాపూర్ సర్కిల్ కార్యాలయంలో పలు విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బందితో డీసీ శశిరేఖ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఆయా విభాగాల అధికారులతో పలు సమస్యలపై చర్చించారు. ముఖ్యంగా చెత్త నిర్వహణ, శానిటేషన్, గ్రీన్ వేస్ట్, రహదారులు తదితర సమస్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో HMWSSB, TGSPDCL, ట్రాఫిక్ పోలీస్ విభాగాలకు చెందిన అధికారులు, ఈఈలు, డీఈలు, ఏఈలు, శానిటరీ సూపర్వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.






