శ్రీశైల మ‌ల్ల‌న్న‌ను ద‌ర్శించుకున్న కార్పొరేటర్ న‌వ‌తారెడ్డి

చందాన‌గ‌ర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చ‌ందాన‌గ‌ర్ కార్పొరేట‌ర్ బొబ్బ న‌వ‌తారెడ్డి జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని బుద‌వారం శ్రీశైల మ‌ల్లికార్జునుడిని ద‌ర్శించుకున్నారు. కుటుంబ స‌భ్యుల‌తో క‌ల‌సి శ్రీశైలం వెళ్లిన న‌వ‌తారెడ్డి భ్ర‌మ‌రాంభ మ‌ల్లికార్జున స్వాముల‌కు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి డివిజ‌న్ ప్ర‌జ‌లు పూర్తిగా ‌బ‌య‌టప‌డి ఆయురారోగ్యాల‌తో జీవించాల‌ని, చందాన‌గ‌ర్ డివిజ‌న్ అభివృద్ధిలో మరింత చెందేలా చూడ‌మ‌ని భ‌గ‌వంతుడిని ప్రార్ధించిన‌ట్టు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here