మియాపూర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో పోలీసుల ఫుట్ పెట్రోలింగ్

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 17 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో పోలీసులు ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని ప్రేమ్ న‌గ‌ర్ ఎ, బి బ్లాక్స్‌తోపాటు మార్తాండ‌న‌గ‌ర్‌, హ‌నీఫ్ కాల‌నీల‌లో పోలీసులు ఈ కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా వారు స్థానికుల‌తో స‌మావేశం అయ్యారు. స్థానికంగా నెల‌కొన్న ప‌రిస్థితుల‌ను స‌మీక్షించారు. పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో ఇక ముందు కూడా ఫుట్ పెట్రోలింగ్ నిర్వ‌హిస్తామ‌ని, ఇందుకు గాను స్థానిక ఎస్ఐల‌తో 4 టీమ్‌ల‌ను ఏర్పాటు చేశామ‌ని పోలీసులు తెలిపారు.

స్థానికుల‌తో మాట్లాడుతున్న పోలీసులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here