త్రో బాల్ విజేత‌కు స‌న్మానం

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 16 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఇంటర్నేషనల్ త్రో బాల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో థాయిలాండ్ లోని బ్యాంకాక్ లో అక్టోబర్ 10 నుండి 12వ తేదీ వరకు నిర్వహించిన ఇండో థాయ్ ఇంటర్నేషనల్ త్రో బాల్ టెస్ట్ సిరీస్ 2024 ఫర్ విమెన్ సిరీస్ లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి ప్రథమ బహుమతి సాధించిన మాదాపూర్ డివిజన్ పరిధిలోని మాదాపూర్ కి చెందిన క్రీడాకారిణి ఎర్రగుడ్ల స్వాతి యాదవ్ ని PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ సత్కరించి ప్రత్యేకంగా అభినదించారు.

స్వాతి యాద‌వ్‌ని స‌త్కరిస్తున్న ఎమ్మెల్యే ఆరెక‌పూడి గాంధీ

అంతర్జాతీయ స్థాయిలో పాల్గొని త్రో బాల్ పోటీలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి ప్రథమ బహుమతి గెలవడం చాలా అభినదించదగ్గ విషయం అని, క్రీడాకారిణి ఎర్రగుడ్ల స్వాతి యాదవ్ ని ప్రత్యేకంగా అభినదిస్తున్నాను అని PAC చైర్మన్ గాంధీ తెలియజేశారు. భవిష్యత్తులో మరిన్ని పథకాలు సాధించాలని, మన దేశం, మన రాష్ట్రం, మన ప్రాంతం పేరు ప్రఖ్యాతులు సాధించేలా మరిన్ని విజయాలు సాధించాలని, తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారిణి తండ్రి మధు యాదవ్, మారబోయిన రాజు యాదవ్, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, చింత కింది రవీందర్ గౌడ్, హరికృష్ణ, ఉమేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here