దారుణ హత్య‌కు గురైన వివాహిత

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 1 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఓ వివాహిత‌ను కొంద‌రు గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు దారుణంగా హ‌త్య చేశారు. మియాపూర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకున్న ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు తెలిపిన ప్ర‌కారం వివ‌రాలు ఈ విధంగా ఉన్నాయి. మియాపూర్‌లోని దీప్తిశ్రీ‌న‌గ‌ర్‌కు చెందిన బండి స్పంద‌న‌, అదే ప్రాంతానికి చెందిన వార‌ణాసి విన‌య్ కుమార్‌కు 2022 ఆగ‌స్టు 4వ తేదీన వివాహం అయింది. కొంత కాలం త‌రువాత వారు గొడ‌వ ప‌డి వేర్వేరుగా నివాసం ఉంటున్నారు. కాగా సెప్టెంబ‌ర్ 30వ తేదీన కొంద‌రు గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు దీప్తిశ్రీ‌న‌గ‌ర్‌లోని సీబీఆర్ ఎన్‌క్లేవ్‌లో స్పంద‌న ఉంటున్న బ్లాక్ నం.3ఎ ఫ్లాట్ నం.110కు వ‌చ్చి ఆమె త‌ల‌పై ఆయుధంతో బ‌లంగా కొట్టారు.

స్పంద‌న (ఫైల్‌)

దీంతో తీవ్ర గాయాల‌పాలైన స్పంద‌న అక్క‌డిక‌క్క‌డే చ‌నిపోయింది. అనంత‌రం ఆ ఇంటికి తాళాలు వేసిన వ్య‌క్తులు అక్క‌డి నుంచి వెళ్లిపోయారు. సాయంత్రం స‌మ‌యంలో మృతురాలి త‌ల్లి న‌మృత‌ టీచ‌ర్ జాబ్ ముగించుకుని ఇంటికి వ‌చ్చి ఎంత త‌ట్టినా త‌లుపు తీయ‌లేదు. దీంతో ఇరుగు పొరుగు వారి స‌హాయంతో త‌లుపుల‌ను తెరిచారు. అక్క‌డ ఆమెకు స్పంద‌న మృత‌దేహం క‌నిపించింది. దీంతో వెంట‌నే ఆమె స‌మాచారం అందించ‌గా పోలీసులు అక్క‌డికి చేరుకుని స్పంద‌న మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి త‌ర‌లించి కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here