శేరిలింగంపల్లి, జూన్ 22 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని మియాపూర్ సర్కిల్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఇందులో డీసీ జి.శ్రీనివాస్తోపాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొని ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. టౌన్ ప్లానింగ్ విభాగానికి 12 ఫిర్యాదులుగా రాగా, ఇంజినీరింగ్ వింగ్కు 1 ఫిర్యాదు అందాయి. మొత్తం 13 ఫిర్యాదులు అందాయని, వాటిని వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని అధికారులు తెలిపారు.






