చందానగర్(నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ సర్కిల్ 21 పరిధిలోని నాలుగు జిహెచ్ఎంసి వార్డులలో కలిపి 245805 మంది ఓటర్ల ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశానుసారం సర్కిల్ పరిధిలోని ఎలక్టోరల్ రోల్ వివరాలను ప్రజలకు తెలిపేవిధంగా నోటీసు బోర్డులో ఉంచారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మాదాపూర్ డివిజన్(107) లో 57827, మియాపూర్ డివిజన్ (108 ) లో 57822 , హఫీజ్ పెట్ డివిజన్(109) లో 70305, చందానగర్ డివిజన్(110) లో 59851మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు.






