నెహ్రూనగర్ శ్రీ రేణుక ఎల్లమ్మ సన్నిధిలో ఘనంగా చండీ హోమం

శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): డివిజన్ పరిధిలోని నెహ్రూనగర్ శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయంలో శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఏడవ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మిదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో చండీహోమం ఘనంగా నిర్వహించారు.

శ్రీ మహాలక్ష్మి దేవి అవతారం లో దర్శనమిస్తున్న నెహ్రూ నగర్ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి

శేరిలింగంపల్లి డివిజన్ టిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి చింతకింది రవీందర్ గౌడ్, ప్రవళిక దంపతులు హోమం ఆచరించారు. డివిజన్ ప్రజలు కరోనా మహమ్మారి నుండి విముక్తులై సుఖశాంతులతో వర్ధిల్లాలని వారు దేవుడిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు చింతకింది డాకయ్య గౌడ్, అమృత దంపతులతో పాటు పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ మహాలక్ష్మీ దేవి అమ్మవారి దర్శనం చేసుకున్నారు.

చండీహోమంలో పాల్గొన్న శేరిలింగంపల్లి డివిజన్ టిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి చింతకింది రవీందర్ గౌడ్, ప్రవళిక దంపతులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here