దీప్తి శ్రీ నగర్ లో చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: వేసవి కాలంలో‌ ఎండ వేడిమిని తట్టుకోలేక పాదచారులు, ప్రజలు ఇబ్బందులు పడకుండా‌ చలివేంద్రాలు ఎంతగానో ఉపయోగపడుతాయని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ చెప్పారు. చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తి శ్రీ నగర్ కాలనీ లో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఎన్టీఆర్ స్మారక చలివేంద్రాన్ని కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నగరంలో రోజు రోజుకూ ఎండలు విపరీతంగా పెరిగిపోతున్నాయని ప్రజలు ఎండ వేడిమిని తాళలేక దాహార్తికి ఇబ్బంది పడకుండా ఉండేందుకు చలివేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ప్రజలకు ఉపయోగపడేలా ఇలాంటి చలి వేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు నరేందర్, దాస్, కాలనీ వాసులు పూర్ణచందర్ రావు, సీతా రామయ్య, రమణ, క్రాంతి, రవి తదితరులు పాల్గొన్నారు.

దీప్తి శ్రీ నగర్ లో చలివేంద్రాన్ని ప్రారంభిస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here