ధర్మపురి క్షేత్రంలో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్‌ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: ఉచిత వైద్య శిబిరాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతాయని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. చందానగర్ డివిజన్ పరిధిలోని శ్రీ ధర్మపురి క్షేత్రంలో శ్రీ ధర్మపురి క్షేత్రం వ్యవస్థాపకురాలు సత్యవాణి ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ఎలైట్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరం ను కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు.

ధర్మపురి ‌క్షేత్రంలో ఉచిత‌ వైద్య శిబిరంలో వైద్య పరీక్షలు చేయించుకుంటున్న ప్రభుత్వ‌ విప్‌ గాంధీ

శ్రీ ధర్మపురి క్షేత్రంలో శ్రీ ధర్మపురి క్షేత్రం వ్యవస్థాపకురాలు సత్యవాణి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. వైద్య శిబిరంలో అన్ని రకాల వైద్యులతో ఉచితంగా వైద్య పరీక్షలు చేసి మందులు అందజేయడం జరిగిందన్నారు. బీపీ, షుగర్, గైనకాలజీ, ఆర్థో, ఈసీజీ, ఈఎన్ టీ తదితర వైద్య సేవలు ఒకే చోట ఏర్పాటు సంతోషకరమని అన్నారు. పేద ప్రజలు ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, నాయకులు నరేందర్, దాస్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here