ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన పట్నం మహేందర్ రెడ్డికి శుభాకాంక్షలు

నమస్తే శేరిలింగంపల్లి: రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి సభ్యుడిగా ఎన్నికైన పట్నం మహేందర్ రెడ్డి శాసనమండలిలో ఎమ్మెల్సీగా చేసిన ప్రమాణ స్వీకారోత్సవంలో ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి శాసన సభ్యులు ఆరెకపూడి గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీగా ప్రమాణం స్వీకారం చేసిన పట్నం మహేందర్ రెడ్డికి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. పట్నం మహేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవంలో ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, బేతి సుభాష్ రెడ్డి, మహేష్ రెడ్డి, కార్పొరేటర్లు నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్, చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు తదితరులు ‌కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

ఎమ్మెల్సీ పట్నం‌ మహేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతున్న ప్రభుత్వ విప్ గాంధీ, కార్పొరేటర్లు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here