బిజెపి నుంచి టీఆర్ఎస్ లోకి చేరారనడం అసత్యం: బిజెపి రాష్ట్ర నాయకులు జ్ఞానేంద్ర ప్రసాద్, యోగానంద్

నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని సుభాష్ చంద్రబోస్ నగర్ లో బీజేపీ నుంచి కొంతమంది టీఆర్ఎస్ లోకి చేరారని చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని, అసత్య ఆరోపణలు చేయడం సరికాదని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్, రాష్ట్ర నాయకులు యోగానంద్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే గులాబీ ఎంపీ, ఎమ్మెల్యేతో కండువా కప్పించి బిజెపి నుంచి చేరారని అసత్య ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. పార్టీలో చేరిన వారికి బిజెపి పార్టీకి ఎలాంటి సంబంధాలు లేవని, అసలు మా పార్టీ కార్యకర్తలు కాదుకదా కనీసం పార్టీ సభ్యత్వం కూడా లేదని ఎద్దేవా చేశారు. ప్రజలంతా బిజెపి వైపు మొగ్గు చూపుతున్నారని, బిజెపికి పెరుగుతున్న మద్దతు చూసి ఇలాంటి దిగజారుడు రాజకీయలు చేస్తున్నారని అన్నారు. ఇకనైనా ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని లేని పక్షంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి డివిజన్ అధ్యక్షులు మాణిక్ రావు, నాయకులు విజేందర్, సిద్దు, వెంకట్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న బిజెపి నాయకులు జ్ఞానేంద్ర ప్రసాద్, యోగానంద్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here