అన్నపూర్ణ ఎన్ క్లేవ్ లో ప్రారంభం కానున్న దేవినవరాత్రోత్సవాలు: శోభాయమానంగా‌ అలంకరణలు

నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని అన్నపూర్ణ ఎన్‌క్లేవ్ లో‌ విశాఖ శ్రీ శారదా పీఠ పాలిత శ్రీ షిర్డీ సాయిబాబా, అన్నపూర్ణ సమేత‌ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ దేవి శరన్నవరాత్రోత్సవాలకు ఆలయ కమిటీ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయంలో విద్యుత్ దీపాలంకరణలు, దేవి మండపాన్ని శోభాయమానంగా అలంకరించారు. అశ్వయుజ శుద్ద ఫాడ్యమి ఈ నెల‌ 7 వ తేదీ గురువారం నుంచి శుద్ధ దశమి ఈ నెల ‌15 వ తేదీ శుక్రవారం వరకు దేవీ నవరాత్రోత్సవాల్లో అమ్మవారు వివిధ రూపాల్లో అలంకరింపబడి దర్శనమివ్వనున్నట్లు ఆలయ ఫౌండర్, చైర్మన్ యు.వి రమణమూర్తి వెల్లడించారు. విగ్రహ దాత జైపాల్ రెడ్డి శోభ ‌దంపతులు, అన్నదాత‌‌ కొమ్ముల శ్రీనివాస్ ప్రసన్న దంపతులు, చండీ హోమాన్ని లీలా రవిచంద్ర కుమార్, శిరీష, అల్పాహారం దాతలుగా‌ సతీష్,హర్షజ దంపతులు ముందుకువచ్చారన్నారు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం కుంకుమార్చన ఉంటుందన్నారు.

దేవీ నవరాత్రోత్సవాలకు విద్యుత్ దీపాలంకరణలతో సాయిబాబా దేవాలయం

అమ్మవారి అవతారాలు
గురువారం              శ్రీ‌ బాల త్రిపుర సుందరి దేవి
శుక్రవారం                 శ్రీ గాయత్రి దేవి
శనివారం                శ్రీ అన్నపూర్ణ దేవి
ఆదివారం               శ్రీ లలితా దేవి
సోమవారం             శ్రీ‌ లక్ష్మీ దేవి
మంగళవారం          శ్రీ సరస్వతీ దేవి
బుధవారం              శ్రీ దుర్గాదేవి
గురువారం             శ్రీ మహిషాసుర మర్థిని దేవి
శుక్రవారం                శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా దర్శనం ఇవ్వనున్నట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు వెల్లడించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here