శేరిలింగంపల్లిలో వైభవంగా ఎంగిలి పూల బతుకమ్మ – వాడవాడలా ఆటపాటలతో ఆడపడుచుల సందడి

నమస్తే శేరిలింగంపల్లి: విశ్వ వ్యాప్యంగా విశిష్టతను‌ సాధించిన బతుకమ్మ పండగ సంబరాలు అమావాస్య రోజున ఘనంగా ప్రారంభమయ్యాయి. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మొదటి రోజు బుధవారం ఎంగిలి పూల బతుకమ్మను మహిళలు తీరొక్క పూలతో అందంగా అలంకరించి సంబరాలను జరుపుకున్నారు. ఆయా డివిజన్ల పరిధిలోని ప్రధాన కూడళ్ల వద్ద సాయంత్రం ఎంగిలిపూల బతుకమ్మకు పూజలు చేసి మహిళలు ఆనందోత్సవాల మధ్య బతుకమ్మ పండగ విశిష్టతను పాటల రూపంలో పాడుతూ చిన్నా పెద్ద అనే తేడా లేకుండా బతుకమ్మ ఆడారు. చందానగర్ డివిజన్ లో కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి, హఫీజ్ పేట్ డివిజన్ లో కార్పొరేటర్ పూజిత గౌడ్ తోటి మహిళలతో కలిసి బతుకమ్మ‌ ఆడారు. అనంతరం బతుకమ్మ‌ ఘాట్ ల వద్ద ఎంగిలిపూల బతుకమ్మను నిమజ్జనం చేసి వారి‌ వెంట తీసుకెళ్లిన తీర్థప్రసాదాలను స్వీకరించారు.

చందానగర్ డివిజన్ లో ఎంగిలి పూల బతుకమ్మ కు పూజలు చేస్తున్న కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి
హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలో ఎంగిలి పూల బతుకమ్మతో కార్పొరేటర్ పూజితజగదీశ్వర్ గౌడ్
గౌతమి నగర్ ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల్లో కసిరెడ్డి సింధురఘునాథ్ రెడ్డి
చందానగర్ మాదవ్ బృందావన్ అపార్ట్మెంట్ లో బతుకమ్మ సంబరాలు
భవానిపురం వినాయక మండపం వద్ద బతుకమ్మలు ఆడుతున్న ఆడపడుచులు
గోపినగర్ లో ఎంగిలి పూల బతుకమ్మ ఆటలో మహిళలు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here