వరద నీటి పనుల్లో వేగం పెంచండి : ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ

వరద నీటి కాలువ నిర్మాణ పనులను పరిశీలిస్తున్న ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని మసీదు బండ లోని ప్రభుపాద లే ఔట్ కాలనీ లో జరుగుతున్న వరద నీటి కాల్వ నిర్మాణ పనులను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ కాలనీలో నెలకొన్న ఎన్నో ఏండ్ల సమస్య నేటితో తీరునని, వరద నీటి కాల్వ నిర్మాణ పనులు త్వరితగతిన చేపట్టాలని, పనులలో వేగం పెంచాలని, నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకూడదని త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని పేర్కొన్నారు. వరద నీటి కాల్వ నిర్మాణం పై అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఏ చిన్న సమస్య ఉన్న తన దృష్టికి తీసుకువస్తే తప్పకుండా పరిష్కరిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి అధికారులు ఏఈ సునీల్, శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షుడు మారబోయిన రాజు యాదవ్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ ఎస్ పార్టీ నాయకులు పద్మారావు, కృష్ణ యాదవ్, వేణు గోపాల్ రెడ్డి, రమణయ్య, మల్లేష్ యాదవ్, నగేష్ గౌడ్, పవన్, ప్రసాద్, సుదర్శన్, కాలనీ వాసులు పాల్గొన్నారు.

వరద నీటి కాలువ పనుల గురించి తెలుసుకుంటున్న ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here