నమస్తే శేరిలింగంపల్లి: గత 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మియాపూర్ డివిజన్ పరిధిలోని నడిగడ్డ తండా బస్తి వరద నీటిలో కొట్టుమిట్టాడుతున్నాది . ఈ నేపథ్యంలో ముంపు ప్రాంతాలలో కలిగే సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి ముంపునకు గురైన ఇండ్లు, లోతట్టు ప్రాంతల్లో స్థానిక నాయకులతో కలసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పర్యటించారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ.. గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నదున లోతట్టు ప్రాంతాలు వరద నీటిలో కొట్టుమిట్టాడుతున్నాయని, అసంపూర్తిగా మిగిలిపోయిన డ్రైనేజీ లైన్ల నిర్మాణం పనులు వేగవంతం చేయాలని, పనులు సకాలంలో పూర్తి చేయాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడలని అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో జిహెచ్ ఎంసీ ఇంజనీరింగ్, జలమండలి అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి నాయక్, స్వామి నాయక్, శంకర్ నాయక్,గోపి నాయక్,రెడ్యానాయక్, చందు యాదవ్, తుకారాం నాయక్, సోమేశ్, రాజు, లక్ పతి నాయక్,జితేందర్ నాయక్, సుధాకర్,మురళి, ఈశ్వర్, మహేష్,కృష్ణ నాయక్, మాన్య నాయక్ , కమలాకర్ , రవి , తదితరులు పాల్గొన్నారు.