ప్రజా అవసరాలకు అనుగుణంగా మెరుగైన సౌకర్యాలు

  • గచ్చిబౌలి డివిజన్ పరిధిలో రూ 1కోటి 25 లక్షలతో అభివృద్ధి పనులు

శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ గాంధీ, కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలో రూ 1.25 కోట్లతో నూతనంగా చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులకు గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిలుగా పాల్గొని శంఖుస్థాపన చేశారు. నల్లగండ్ల గ్రామంలో రూ.22 లక్షలు, శ్రీ కృష్ణ కాలనీలో రూ. 20 లక్షలు, నవోదయ కాలనిలో రూ.30. లక్షలు, రాజీవ్ నగర్ కాలనిలో రూ.20 లక్షలు, ఎన్టీఆర్ నగర్ లో రూ.33 లక్షల అంచనా వ్యయంతో చేబట్టబోయే భూగర్భ డ్రైనేజి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ కాలనీలను అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని చెప్పారు. సమస్యలను ఒక్కొకటిగా అధిగమిస్తూ శాశ్వత పరిష్కారం చూపుతున్నామని అన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక దృష్టి వహిస్తున్నామని అన్నారు. గతంలో ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. కార్యక్రమంలో జలమండలి జీఎం రాజశేఖర్, మేనేజర్ అభిషేక్ రెడ్డి, గచ్చిబౌలి డివిజన్ పరిధి లోనీ రాష్ట్ర, జిల్లా, సీనియర్ నాయకులు, డివిజన్ నాయకులు , మహిళ నాయకులు, మహిళ కార్యకర్తలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు, అభిమానిలు , కాలనీ వాసులు స్థానిక నేతలు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here