వినాయకులకు మొవ్వ సత్యనారాయణ పూజలు

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం హఫీజ్ పేట్, మియాపూర్, ఆల్విన్ కాలనీ, వివేకానంద నగర్ డివిజన్లలో చంద్రమ్మ నగర్ అసోసియేషన్, టీమ్ మియాపూర్ వారియర్స్, హనుమాన్ యూత్ అసోసియేషన్, రాయల్ యూత్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో గణపతి నవరాత్రులు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆయా మండపాల్లో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కంటెస్టెడ్ ఎమ్మెల్యే మొవ్వా సత్యనారాయణ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, శేరిలింగంపల్లి ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాఅష్టైశ్వర్యాలతో, పాడి పంటలతో చల్లగా ఉండాలని కోరుకున్నారు.

అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రవీందర్ రావు, నవీన్ గౌడ్, రాయల్ నంద కుమార్, జగన్ గౌడ్, వెంకటేష్, సెల్వ రాజు, లింగయ్య, బాలరాజు, రాజి రెడ్డి, రాఘవేందర్, మహేష్ యాదవ్, మహి, రాహుల్, వేణు, చిన్న, జనార్ధన్, శరన్, సాయి కుమార్, భరత్, అనిల్ కుమార్, శ్రీశైలం యాదవ్, విజయ్ కుమార్, తపన్, రాజ్ కుమార్, బిక్షపతి, వర్షిత్, ప్రశాంత్ మరియు నాయకులు, కార్యకర్తలు కాలనీ వాసులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here