ఆయన స్థానాన్ని ఎవరూ బర్తీ చేయలేకపోయారు..!

వివేకానంద సేవా సంఘం అనాధాశ్రమం నిర్వాహకులకు టీవీని అందజేస్తున్న టీఆర్ఎస్వీ నేత రవిందర్ యాదవ్

-కొండకల్ శంకర్ గౌడ్ స్మరణలో అనాధ చిన్నారులకు టీవీని బహుకరించిన రవిందర్ యాదవ్

మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): టీఆర్ఎస్ నేత దివంగత కొండకల్ శంకర్ గౌడ్ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన అభిమాని, పార్టీ విద్యార్థి విభాగం నాయకుడు రవిందర్ యాదవ్ అనాధ చిన్నారులకు చేయూతను అందించాడు. మియాపూర్ లోని వివేకానంద సేవా సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న అనాధాశ్రమం చిన్నారుల ఆన్ లైన్ చదువులకు ఉపయోగపడేలా 32 ఇంచుల ఎల్ఈడీ స్మార్ట్ టీవీని అందచేశాడు. ఈ సందర్భంగా రవీందర్ యాదవ్ మాట్లాడుతూ తనలాంటి ఎందరో యువకులను రాజకీయాల వైపు నడిపించిన ఆదర్శప్రాయుడు శంకర్ గౌడ్ అని కొనియాడారు. ఆయన లేని లోటు ఇప్పుడు తెలుస్తుందని, వారి స్థానాన్ని ఎవరు బర్తీ చేయలేకపోయారని అన్నారు. వారి స్మరణలో అనాధ చిన్నారులకు తోచిన సహకారం అందించడం భాద్యతగా బావిస్తున్నాట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు పాల్గొన్నారు.

రవీందర్ యాదవ్ బహుకరించిన టీవీని ఆసక్తిగా తిలకిస్తున్న అనాధ చిన్నారులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here