- ముఖ్య అతిథులు ప్రైమరీ అకడమిక్ కో ఆర్డినేటర్ అర్చన ఠాకూర్, త్రివేణి పాఠశాల డైరెక్టర్ డాక్టర్ జి. వీరేంద్ర చౌదరీ
నమస్తే శేరిలింగంపల్లి: త్రివేణి పాఠశాలలో సైన్స్ (బస్ల్) విద్యా వైజ్ఞానిక ప్రదర్శన వైభవంగా జరిగింది. ఈ నెల 28న రామానుజం గౌరవార్థం నిర్వహించే నేషనల్ సైన్స్ డే ను పురస్కరించుకుని శేరిలింగంపల్లి లోని ఆ పాటశాలలో చేపట్టిన (బస్ల్) ప్రదర్శన ఆకట్టుకున్నది. ముఖ్య అతిథిగా ప్రైమరీ అకడమిక్ కో ఆర్డినేటర్ అర్చన ఠాకూర్ పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు తమ ప్రదర్శనల ద్వారా ప్రతి విషయాన్ని విపులంగా వివరించారని తెలిపారు.
![](https://namastheslp.com/wp-content/uploads/2024/02/IMG-20240223-WA0012.jpg)
విశేష అతిథిగా పాల్గొన్న త్రివేణి పాఠశాల డైరెక్టర్ డాక్టర్ జి. వీరేంద్ర చౌదరీ మాట్లాడారు. విద్యార్థులు తమ హావభావాలతో కురిపించారు వారిని అభినందనలతో ముంచెత్తారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో నూతన ఉత్తేజం, ఆత్మ విశ్వాసం పెంపొందుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల అకడమిక్ కో ఆర్డినేటర్ డాక్టర్ నటరాజ్, సి ఆర్ ఓ సాయి నర్సింహ రావు, ఏసిఆర్వో నరేష్, ప్రిన్సిపల్ సి. అనితరావు, ఉపాద్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.