విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలతో నూతన ఉత్తేజం, ఆత్మ విశ్వాసం మెండు 

  • ముఖ్య అతిథులు ప్రైమరీ అకడమిక్ కో ఆర్డినేటర్ అర్చన ఠాకూర్, త్రివేణి పాఠశాల డైరెక్టర్ డాక్టర్ జి. వీరేంద్ర చౌదరీ

నమస్తే శేరిలింగంపల్లి: త్రివేణి పాఠశాలలో సైన్స్ (బస్ల్) విద్యా వైజ్ఞానిక ప్రదర్శన వైభవంగా జరిగింది. ఈ నెల 28న రామానుజం గౌరవార్థం నిర్వహించే నేషనల్ సైన్స్ డే ను పురస్కరించుకుని శేరిలింగంపల్లి లోని ఆ పాటశాలలో చేపట్టిన (బస్ల్) ప్రదర్శన ఆకట్టుకున్నది. ముఖ్య అతిథిగా ప్రైమరీ అకడమిక్ కో ఆర్డినేటర్ అర్చన ఠాకూర్ పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు తమ ప్రదర్శనల ద్వారా ప్రతి విషయాన్ని విపులంగా వివరించారని తెలిపారు.

చిన్నారుల ప్రదర్శనను తిలకిస్తూ.. చిన్నారులను అభినందిస్తున్న ప్రైమరీ అకడమిక్ కో ఆర్డినేటర్ అర్చన ఠాకూర్

విశేష అతిథిగా పాల్గొన్న త్రివేణి పాఠశాల డైరెక్టర్ డాక్టర్ జి. వీరేంద్ర చౌదరీ మాట్లాడారు. విద్యార్థులు తమ హావభావాలతో కురిపించారు వారిని అభినందనలతో ముంచెత్తారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో నూతన ఉత్తేజం, ఆత్మ విశ్వాసం పెంపొందుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల అకడమిక్ కో ఆర్డినేటర్ డాక్టర్ నటరాజ్, సి ఆర్ ఓ సాయి నర్సింహ రావు, ఏసిఆర్వో నరేష్, ప్రిన్సిపల్ సి. అనితరావు, ఉపాద్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here