ట్రాఫిక్ నియామాలపై శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అవగాహన

  • నల్లగండ్ల శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులతో కలిసి ర్యాలీ

నమస్తే శేరిలింగంపల్లి : ట్రాఫిక్ నియమ, నిబంధనలపట్ల కార్పొరేటర్ నాగేందర్ యాదవ్ అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా శేరిలింగంపల్లి లోని నల్లగండ్ల శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులతో కలిసి ర్యాలీ చేపట్టారు.

ట్రాఫిక్ పట్ల అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ కు రోజా పువ్వు ఇచ్చి శుభాకాంక్షలు తెలుపుతున్న నల్లగండ్ల శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులు

ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ విద్యార్థి దశ నుండే రోడ్ల పై వాహనాలలో ఎలా వెళ్లాలో, సిగ్నల్స్ ఎలా పాటించాలో, ఎలా వెళ్తే భద్రంగా ఇంటికి వెళ్ళవచ్చో రోడ్లపై ప్రయాణం చేసినప్పుడు ఏ నియమాలు పాటిస్తే సురక్షితంగా ఇంటికి వెళ్ళగలుగుతాం. ఫోర్ వీలర్ లో వెళ్ళినప్పుడు విధిగా సీటు బెల్టు ధరించడం, టు వీలర్ లో వెళ్ళినప్పుడు హెల్మెట్ పెట్టుకోవడం వంటి నియమాలు పాటిస్తే మన ప్రయాణం సురక్షితంగా జరుగుతుందని సూచించారు. ప్రతిఒక్కరూ విధిగా రోడ్డు నియమాలు పాటించాలని విద్యార్థులకు అవగాహనా కల్పించారు. వాహనాల పై ప్రయాణం చేస్తున్నప్పుడు మద్యపానం సేవించి కానీ, అజాగ్రత్తగాని వెళ్లరాదని వాహనాలలో వెళ్ళినప్పుడు అన్ని పత్రాలు తమ దగ్గర ఉంచుకోవాలని మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని, తనిఖీలలో దొరికితే వాహనాల యాజమానులకు శిక్ష పడుతుందని తెలిపారు.

కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ కు శుభాకాంక్షలు తెలుపుతున్న ట్రాఫిక్ పోలీసులు

ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ ఐ, శేరిలింగంపల్లి డివిజన్ గౌరవ ఆధ్యక్షలు వీరేశం గౌడ్, సీనియర్ నాయకులు రాంచందర్, స్కూల్ స్టాఫ్ & టీచర్స్, స్కూల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here