- ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం, రూ. 5వేలు అందజేత
నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని వివేకానంద సేవా సంఘం వృద్ధాశ్రమంలో టెక్ మహీంద్రా సాఫ్ట్ వేర్ సంస్థ SBU – ET HR గ్రూప్ విభాగంకు చెందిన HR ప్రశాంత్ జన్మదినాన్ని పురస్కరించుకుని రూ. 5వేల ఆర్థిక సహాయంతో పాటు నిర్వహించిన అన్నదానం కార్యక్రమాన్ని కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి వృద్ధులకు అన్న ప్రసాదాలు వడ్డించి నిర్వాహకులకు చెక్కును అందజేశారు ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీ. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ప్రశాంత్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ.. తనకు తోచిన విధంగా సహాయం చేయడం, వృద్ధులకు, అన్నదానం చేయడం అభినందనీయమని, వృద్దుల మధ్య జన్మదినం నిర్వహించుకోవడం చాలా అభినందించదగ్గ విషయమని, ఎంతో మందికి ఆదర్శ ప్రాయులుగా నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్, తెరాస నాయకులు MD ఇబ్రహీం, టెక్ మహీంద్రా సంస్థ ప్రతినిధులు ప్రశాంత్, శ్రీధర్, కిషోర్ పాల్గొన్నారు.
![](https://namastheslp.com/wp-content/uploads/2022/11/IMG-20221123-WA0038.jpg)