నమస్తే శేరిలింగంపల్లి: శిల్పారామం మాదాపూర్ లో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకుంటున్నాయి. ఇందులో భాగంగా తాండవ ఆర్ట్స్ కూచిపూడి డాన్స్ అకాడమీ గురువు మధుసూదన్ తన శిష్య బృందం చే కూచిపూడి నృత్య ప్రదర్శన ఇచ్చారు.
తాండవ నృత్యకారి, శివాష్టకం, భామాకలాపం, జయదేవ అష్టపది, గజవదన బేడువే, శివరంజని తిల్లాన, ఆధ్యాత్మ రామాయణ కీర్తన, ఆనంద తాండవం, జయము జయము లలితకలవానికి, దేవదేవం భజే, మరకత మణిమయ మొదలైన అంశాలను మధుసూదన్, అద్వైత, వైష్ణవి, సాత్విక, రిత్విక, శుక్లాచారి, సునీత ప్రదర్శించి మెప్పించారు.