లక్ష దీపోత్సవంలో వైభవంగా సుబ్రహ్మణ్య కళ్యాణం

నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ శిల్పఎంక్లేవ్ లోని విశాఖ శ్రీ శారదా పీఠపాలిత శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో కార్తీక మాస లక్ష దీపోత్సవం మంగళవారం కొనసాగింది. ప్ర‌ధానార్చ‌కులు ప‌వ‌న‌కుమార శ‌ర్మ‌, ముర‌ళీధ‌ర శ‌ర్మ బృందం ప‌ర్య‌వేక్ష‌ణ‌లో స్థానిక భక్తులు చలసాని జయక్రిష్ణ. నాగనిఖిత దంపతులు , రాజ్ కుమార్, మధుమతి దంపతులతో వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య కళ్యాణం వైభవంగా జరిపించారు. ఆలయ ప్రాంగణం భక్తజనంతో కళకళలాడింది.

సుబ్రహ్మణ్య కళ్యాణం జరిపిస్తున్న పూజారులు, స్థానిక భక్తులు

నాలుగవ రోజు దీపోత్సవంలో ఆల‌య వ్య‌వ‌స్థాప‌క చైర్మ‌న్ యూవీ ర‌మ‌ణ‌మూర్తి, క‌మిటి స‌భ్యులు చంద్ర‌శేఖ‌ర్‌, చెన్నారెడ్డి, జైపాల్ రెడ్డి, సుధాకర్, విద్యాసాగర్ ఇతర సభ్యులు, శిల్పాఎన్‌క్లేవ్ కాల‌నీ సంక్షేమ సంఘం స‌భ్యులు, కాల‌నీ వాసులు, ఆల‌య సేవాద‌ళం స‌భ్యులు, ప‌రిసర ప్రాంతాల భ‌క్తులు పెద్ద సంఖ్య‌లో పాల్గొని భక్తీ శ్రద్ధలతో ప‌దివేల‌ దీపాలు వెలిగించారు.

భక్తి శ్రద్దలతో దీపాలు వెలిగిస్తున్న భక్తజనం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here