గచ్చిబౌలి పీఎస్ హెడ్ కానిస్టేబుల్ గౌస్, కానిస్టేబుల్ ప్రవీణ్ కుమార్ లకు సేవా పతకాలు

  • పోలీస్ వ్యవస్థ పటిష్టతకు.. శాంతి భద్రతల పర్యవేక్షణకు మరింతగా పాటుపడాలి: సిపి స్టీఫెన్ రవీంద్ర
  • ఉత్తమ సేవలకు కానిస్టేబుళ్లను వరించిన సేవా పతకాలు
కానిస్టేబుళ్ ప్రవీణ్ కుమార్ కు పతకం అందజేస్తున్న సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర

నమస్తే శేరిలింగంపల్లి: శాంతి భద్రతల పర్యవేక్షణలో, ప్రజలకు ఉన్నత సేవలు అందించడంలో ఉన్నతంగా విధులు నిర్వహించినందుకు కానిస్టేబుళ్లను సేవ పతకాలు వరించాయి. ఈ సందర్భంగా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ మొహమ్మద్ గౌస్, పి సి ప్రవీణ్ కుమార్ లకు సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర వారికి అవార్డులను అందజేశారు. గణతంత్ర దినోత్సవాల్లో భాగంగా వీరికి అవార్డులు అందజేస్తున్నట్లు సిపి వెల్లడించారు. అవార్డులు అందుకున్న వారు పోలీస్ వ్యవస్థ పటిష్టతకు మరింతగా పాటుపడాలని సూచించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here