సైక్లింగ్ వెళ్లిన వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి

నమస్తే శేరిలింగంపల్లి : సైక్లింగ్ వెళ్లిన వ్యక్తి (70) రోడ్డు ప్రమాదంలో మరణించిన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. వివరాలు. రిటైర్డ్ ఉద్యోగి వినోద్ కుమార్ (70) అతని భార్య చందానగర్ లోని అపర్ణ లేక్ బ్రిడ్జి వద్ద ఓ అపార్టుమెంట్ లో నివసిస్తున్నారు. తన కుమార్తె గర్భవతి కావటంతో తన అల్లుడు ఫణి కుమార్ కూడా ఆరునెలలుగా ఇక్కడే ఉంటున్నారు. అయితే ఎప్పటిలాగే వినోద్ కుమార్ సాయంత్రం చందానగర్ నుండి BHEL వైపు సైక్లింగ్ కోసం వెళ్తున్నాడు. కెఎల్ఎం షాపింగ్ మాల్ వద్దకు రాగానే మియాపూర్ నుండి వస్తున్న టిప్పర్ లారీ (Br No TS15UD3331 ) అతడిని ఢీకొట్టింది. లారీ డ్రైవర్ నిర్లక్ష్యానికి అతను అక్కడిక్కడే మృతిచెందాడు. ఈ విషయాన్నీ రవి అనే వ్యక్తి వాళ్ళ ఇంటికి వెళ్లి ఫణికుమార్ కి తెలపటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.

రోడ్డు ప్రమాదంలో మరణించిన వినోద్ కుమార్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here