ఎల్లమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ ఆదర్శ్ నగర్ లోని రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో బోనాల ఉత్సవాలు అంబరాన్నంటాయి. ప్రముఖులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని కాంక్షిస్తూ వేడుకుంటున్నారు.

ఇందులో భాగంగానే రేణుక ఎల్లమ్మ గుడి కి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మొవ్వా సత్యనారాయణ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి డివిజన్ ప్రధాన కార్యదర్శి చిట్టా రెడ్డి ప్రసాద్, బీజేవైఎం ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్, రంగారెడ్డి అర్బన్ జిల్లా కార్యవర్గ సభ్యులు లీలా ప్రసాద్, చందానగర్ డివిజన్ మహిళా మోర్చా అధ్యక్షులు శోభ దూబే, ఆనంద్, నీలకంఠారెడ్డి, పృథ్వి, గిరి, ప్రశాంత్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here