అభివృద్ధిలో వెనకంజ హైదర్ నగర్ డివిజన్

  • మోడల్ స్కూల్స్ సంగతేమిటి మినిస్టర్
  • ఇచ్చిన హామీలు బోలెడు.. అభివృద్ధి జానెడు
  • 38 వరోజు గడపగడపకు బిజెపి రవన్న ప్రజా యాత్రలో బిజిపి రాష్ట్ర నాయకుడు రవి కుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: హైదర్ నగర్ డివిజన్ దత్తత పేరుతో ఓట్లు దండుకొని అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిపిన ఘనత బీఆర్ఎస్ నాయకులదే అని బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్ అన్నారు. దత్తత పేరుతో వంచించి ఓట్లు దండుకున్న ప్రజా ప్రతినిధులు అభివృద్ధికి మాత్రం ఆమడ దూరంలో ఉన్నారని
రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్ విమర్శించారు. గడపగడపకు బిజెపి రవన్న ప్రజా యాత్రలో భాగంగా హైదర్ నగర్ డివిజన్ లో హైదర్ నగర్ విలేజ్, నందమూరి నగర్ గడపగడపకు బిజెపి కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా రవి కుమర్ యాదవ్ మాట్లాడుతూ పాదయాత్రలో పర్యటిస్తుండగా మురికి కాలువలు, చెత్తాచెదారం, పందులు, కుక్కలు జలాల మధ్య తిరుగుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి దత్తత తీసుకున్న డివిజన్ ని అన్ని రకాలుగా అభివృద్ధి పరచాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జానకిరామరాజు, డివిజన్ అధ్యక్షులు నవీన్ గౌడ్, నాయకులు అరుణ్ కుమార్, వేణుగోపాల్ యాదవ్, శేషయ్య, బాగాని శ్రీనివాస్, బద్రి, బాలాజీ, కృష్ణంరాజు, వీరాచారి, సీతారామరాజు, సునీల్ రెడ్డి, రాజారెడ్డి, వీరు యాదవ్, ప్రశాంత్ గౌడ్, షేక్ బాషా, నర్సింగ్, కృష్ణ, బాలయ్య, నరేష్ , దుర్గా రాజేశ్వరి, సైదమ్మ, విజయ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here