చందానగర్ సర్కిల్ అటవీ అధికారిపై సస్పెన్షన్ వేటు

  • అటవీశాఖ అనుమతులు తీసుకోకుండా చెట్ల నరికివేత
  • సామాజిక కార్యకర్త వినయ్ వంగల ఫిర్యాదు.. స్పందించిన ఫారెస్ట్ అధికారులు
  • గత నెలలో 73 చెట్లను నరికినట్లు వెల్లడి
  • హైటెక్ సిటీ నుండి కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్ వరకు తొలగించింట్లు గుర్తింపు

నమస్తే శెరిలింగంపల్లి: అటవీశాఖ అనుమతులు తీసుకోకుండా చెట్లను నరికివేసినందుకు ఓ అధికారిపై వేటు పడింది. ఈ ఘటనపై ఫారెస్ట్ అధికారులు సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. దారి వెంట ఉన్న చెట్లను నరికివేసి ఉన్నతాధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదంటూ జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న ఓ అధికారిని కూడా సస్పెండ్ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైటెక్ సిటీ నుండి కేపీహెచ్ బీకి వెళ్లే మార్గంలో హైటెక్ సిటీ ఫ్లై ఓవర్ నుండి యశోద ఆస్పత్రి వరకు ఉన్న సుమారు 73 చెట్లను గత నెలలో జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసులు నరికివేశారు. దీనిపై సామాజిక కార్యకర్త వినయ్ వంగల రాష్ట్ర చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ రాకేష్ మోహన్ దోబ్రియాల్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై సీరియస్ గా స్పందించిన దోబ్రియాల్ రంగారెడ్డి జిల్లా అటవీ అధికారి డి. సుధాకర్ రెడ్డి, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చిల్కూర్, ఎఫ్ డీఓ శంషాబాద్ లను ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. వారు ఈనెల 1వ తేదీన హైటెక్ సిటీ నుండి కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్ వరకు గుర్తించారు. నరికిన చెట్లను అశోక్ లేలాండ్ మినీ ట్రక్కులు నెంబర్ టిఎస్ 07 యుసి 5162, టిఎస్ 09 యుసి 3558లలో తరలించినట్లు గుర్తించారు.

 

సంఘటన స్థలంలో ఉన్న డ్రైవర్లను ఆరా తీయగా.. వారు చెట్లను ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది నరికివేసినట్లు తెలిపారు. అక్రమంగా నరికిన దుంగలను జీహెచ్‌ఎంసీ వాహనంలో ఎక్కించి అక్కడి నుంచి తరలించినట్లు వెల్లడించారు. దీనిపై ఫారెస్ట్ అధికారులు పూర్తిస్థాయి నివేదిక తయారు చేసి రాష్ట్ర చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ రాకేష్ మోహన్ దోబ్రియాల్ కు అందజేశారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోసు చేశారు ఫారెస్ట్ అధికారులు. అలాగే ఈనెల 8న కొత్తగూడలోని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్‌తో కలిసి ఉన్నతాధికారులు మళ్లీ స్థలాన్ని పరిశీలించారు. చెట్ల నరికివేతపై జీహెచ్ఎంసీ ఫీల్డ్ అసిస్టెంట్లను విచారించి, వారిని అరణ్య భవన్‌కు పిలిపించి జీహెచ్ఎంసీ, యూబీడీ, మియాపూర్ పరిధిలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ల వాంగ్మూలాలను తీసుకున్నారు. వారి విచారణలో ఎఫ్ ఆర్ ఓ / యూబీడీ, జీహెచ్ఎంసీ మేనేజర్ కె. చంద్రకాంత్ రెడ్డి సమక్షంలోనే రహదారి వెంట ఉన్న చెట్ల నరికివేత జరిగినట్లు నిర్దారించారు.

ఫారెస్ట్ ఆఫీసర్‌గా చెట్లను రక్షించాలి, తన దృష్టికి వచ్చినప్పుడు చెట్ల నరికివేతను ఆపాలి, కానీ దురదృష్టవశాత్తు అతను తన ప్రాథమిక కర్తవ్యాన్ని పూర్తిగా విస్మరించి భారీ సంఖ్యలో చెట్ల నరికివేతలో పాల్గొన్నాడని అధికారులు తెలిపారు. సామాజిక కార్యకర్త వినయ్ వంగల ఫిర్యాదును దృష్టిలో ఉంచుకుని, ఉన్నతాధికారుల విచారణలోనూ చెట్ల నరికివేతకు సంబంధించి ఫారెస్ట్ అధికారి కె.చంద్రకాంత్ రెడ్డి పాత్ర ఉందని నిర్ధారణ జరగడంతో ఆయన సస్పెన్షన్ వేటు వేస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఈ చెట్ల నరికివేతకు సంబంధించి జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్, ట్రాఫిక్ పోలీసులు, ఇతర అధికారులపై కూడా చర్యలకు ఆదేశించారు ఫారెస్ట్ అధికారులు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here