నెహ్రూ నగర్ కాలనీలో నూతన సీసీ రోడ్డు పనుల పరిశీలన

  • త్వరితగతిన అందుబాటులోకి తేవాలని కాంట్రాక్టర్లు , అధికారులకు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిదిలోని నెహ్రూ నగర్ కాలనీలో నూతనంగా చేపట్టే సీసీ రోడ్డు పనులను శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ స్థానిక వాసులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీసీ రోడ్డు పనులలో నాణ్యతా ప్రమాణాలను పాటించాలని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా త్వరితగతిన పనులను పూర్తిచేయాలని సంబంధిత జిహెచ్ఎంసి అధికారులకు, కాంట్రాక్టర్ కు ఆదేశించారు. కార్యక్రమంలో డివిజన్ ఉప అధ్యక్షుడు యాదా గౌడ్, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు కే.ఎన్. రాములు, గోపినగర్ బస్తీ అధ్యక్షులు గోపాల్ యాదవ్, చింతకింది రవీందర్ గౌడ్, శ్రీకాంత్ యాదవ్, సురేష్, మాణిక్యం, స్థానిక వాసులు పాల్గొన్నారు.

నెహ్రూ నగర్ కాలనీలో చేపడుతున్న నూతన సీసీ రోడ్డు పనులను పరిశీలిస్తున్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here