సభ వేదికపై చెప్పులు అపవిత్రం: యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సూర్యవంశం ప్రలీత్

నమస్తే శేరిలింగంపల్లి: క్రైస్తవ సమాజానికి అత్యంత వైభవంగా పవిత్రంగా భావించే మాసం. ఈ మాసంలో ఆధ్యాత్మికంగా ఏసు క్రీస్తు భక్తి చెంతనే ప్రతీరోజు ప్రార్థనలు, సువార్త సభలు నిర్వహించడం ఆనవాయితీ. త్వరలో క్రిస్మస్ పండుగ రానున్నది. ఇందులో భాగంగా ఆదివారం కల్వరి టెంపుల్ ఆధ్వర్యంలో.. సువార్త సభ నిర్వహించారు.

కల్వరి టెంపుల్ ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో వచ్చిన ప్రభుత్వ విప్ గాంధీ

ఈ  సభకు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ ఎంఎల్ఎ అభ్యర్థి ఆరెకపూడి గాంధీ చెప్పులు ధరించి సభా వేదికను అపవిత్రం చేశారని యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సూర్యవంశం ప్రలీత్ తెలిపారు. ఇదేనా, కులమతాలకు వారిచ్చే విలువని మండిపడ్డారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here