ప్రభుత్వ విప్ గాంధీకే మా మద్దతు

  • ఎమ్మెల్యేను కలిసిన ప్రకాష్ నగర్ కాలనీ వాసులు

నమస్తే శేరిలింగంపల్లి : హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని ప్రకాష్ నగర్ కాలనీ వాసులు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీకి మద్దతు తెలిపారు. వివేకానంద నగర్ కాలనీలోని తన నివాసంలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీని మర్యాదపూర్వకంగా కలిసి పూర్తి స్థాయి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ప్రకాష్ నగర్ కాలనీ వాసులు మాట్లాడుతూ  రాబోయే ఎన్నికల్లో తమ పూర్తి స్థాయి మద్దతు ప్రభుత్వ విప్ గాంధీకే ఉంటుందని, వారికి అన్ని విధాలుగా అండగా ఉండి అఖండ మెజారిటీతో గెలిపించుకుంటామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆరెకపూడి గాంధీ గెలుపు కోసం కృషి చేస్తామని, నిత్యం తమకు ఎల్లవేళలో అందుబాటులో ఉండి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ తన పై చూపిన అభిమానానికి ధన్యవాదాలు తెలిపారు. ముచ్చటగా మూడోసారి భారీ మెజారిటీతో గెలిచి శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్నిరంగాలలో  అగ్రగామిగా నిలబెట్టడానికి శాయశక్తులా కృషి చేస్తానని పేర్కొన్నారు.  తన వెన్నంటి నిలిచిన శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజానీకానికి, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, కార్పొరేటర్లకు, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులకు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, వార్డ్ మెంబర్లకు, ఏరియా కమిటీ ప్రతినిధులకు, ఉద్యమకారులకు, పాత్రికేయ మిత్రులకు,  అభిమానులకు,  శ్రేయభిలాషులకు, కాలనీల అసోసియేషన్ సభ్యులకు, కాలనీ వాసులకు హృదయపూర్వక ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రకాష్ నగర్ కాలనీ ప్రెసిడెంట్ వెంకట్ రెడ్డి, జనరల్ సెక్రటరీ రాజేశ్వర్ రావు మరియు కాలనీ వాసులు బీఆర్ఎస్ పార్టీ శ్రేయభిలాషులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here