పోలీసు అమరవీరులను స్మరిస్తూ 10కే సైక్లింగ్ ర్యాలీ

  • సైబరాబాద్ సీపీ కార్యాలయం నుంచి హెచ్‌సియు మెయిన్ గేట్ వరకు ర్యాలీ
  • జెండా ఊపి ర్యాలీని  ప్రారంభించిన డిసిపి శిల్పవల్లి

నమస్తే శేరిలింగంపల్లి : పోలీసు సంస్మరణ దినోత్సవం సందర్బంగా గచ్చిబౌలిలోని సైబరాబాద్ సీపీ కార్యాలయం నుంచి హెచ్‌సియు మెయిన్ గేట్ వరకు సైబరాబాద్ పోలీసులు, SCSC & హైదరాబాద్ సైక్లిస్ట్‌ల బృందంతో కలిసి 10కే సైకిల్ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీని డిసిపి శిల్పవల్లి జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో దాదాపు 100 మంది సైక్లింగ్ ఔత్సాహికులు, పోలీసులు, పోలీస్ ఉన్నతాధికారులతో పాటు డిసిపి ఉత్సహంగా పాల్గొని రైడ్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. ర్యాలీలో పాల్గొన్న హెచ్‌సిజికి చెందిన రవీందర్ నందనూరి తో పాటు ప్రతీ ఒక్కరికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. 60 ఏండ్ల వయస్సులోనూ నిత్యం 50 కిలోమీటర్లు సైక్లింగ్ చేస్తూ నేటి 10కే రన్ లోనూ ఉత్సాహంగా పాల్గొనటం పట్ల నరేందర్ రావును అభినందించారు. ప్రణవ్ అనే వ్యక్తి కూడా 7 కిలోమీటర్లు పూర్తి చేశాడని తెలిపారు. నిత్యం ఉల్లాసంగా. . ఉత్సాహంగా ఉండడానికి క్రీడలు దోహద పడతాయని, ఆ దిశగా అందరు ప్రయత్నించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాయదుర్గం ఎస్ హెచ్ఓ ఎం. మహేష్, SCSC జాయింట్ సెక్రటరీలు ఐ . రఘు & శ్రీనివాస్, మాదాపూర్ & గచ్చిబౌలి ట్రాఫిక్ ఎస్ హెచ్ఓ శ్రీనాథ్ & నవీన్‌, అధికారులు పాల్గొన్నారు.

సైబరాబాద్ సీపీ కార్యాలయం వద్ద 10కే సైక్లింగ్ రన్ ను జెండా ఊపి ప్రారంభిస్తున్న డిసిపి శిల్పవల్లి

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here