పనులను జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలి : ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: సర్వీస్ రోడ్డు విస్తరణ , వరద నీటి కాల్వల నిర్మాణం పనులను జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులో కి తీసుకురావాలని ప్రభుత్వ విప్ గాంధీ అధికారులకు ఆదేశించారు. జాతీయ రహదారి ఎం హెచ్ 65 ప్రధాన రహదారి పై భేల్ చౌరస్తా లో రూ. 1కోటి 30లక్షల అంచనావ్యయం తో చేపడుతున్న ఫ్లై ఓవర్ నిర్మాణంలో భాగంగా జరుగుతున్న సర్వీస్ రోడ్డు విస్తరణ , వరద నీటి కాల్వల నిర్మాణం పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ప్రజాసౌకర్యార్థం నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ నిర్మాణం పనులను వేగవంతం చేయాలని, వరద నీరు కాల్వ నిర్మాణం పనులు త్వరితగతిన పూర్తి చేసి నీటి ప్రవాహం సాఫీగా సాగేలా చూడాలని, వర్షాకాలం ను దృష్టిలో పెట్టుకొని పనులలో జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని అధికారులకు ఆదేశించారు. సర్వీస్ రోడ్డు లో షాప్ ల సముదాయం ముందు తీసిన గోతుల చుట్టూ రక్షణ చర్యలు తీసుకొని ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ఫ్లై ఓవర్ నిర్మాణం పనులు నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకూడదని, ఫ్లై ఓవర్ నిర్మాణం పై అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ బీఆర్ ఎస్ పార్టీ నాయకులు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అక్బర్ ఖాన్, మల్లేష్ గుప్తా, గురుచరణ్ దుబే, రాజశేఖర్ రెడ్డి, నరేందర్ బల్లా,యశ్వంత్ అమిత్, అంజద్, సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here